షర్మిలా దీక్షకు మద్దతు తెలిపిన కోమటిరెడ్డి…

-

వైఎస్ షర్మిలా ఇవాళ చేస్తున్న నిరుద్యోగ దీక్షకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ‌న్న బిడ్డ‌గా మా నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ష‌ర్మిల గారి దీక్ష‌కు సంఘీభావం తెలియ‌జేస్తున్నానని..వారికి తన పూర్తి మ‌ద్ద‌తు ఉంటుందన్నారు.

కేసీఆర్ ఉద్య‌మ‌కారుల‌ను మోసం చేశారని.. ఉద్యోగాలను వ‌దిలేసి కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడని పేర్కొన్నారు. వైఎస్సార్ మాకు ప్రాణమని.. బ‌తికున్నంత వ‌ర‌కూ వైఎస్సార్ మా గుండెల్లో ఉంటారన్నారు. మునుగోడు ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ ఉద‌య స‌ముద్రం ప్రాజెక్టు క‌ట్టించారని.. ఆ ప్రాజెక్టు ద్వారా ల‌క్ష ఎక‌రాల‌కు నీరందించారని వెల్లడించారు. వైఎస్సార్ 90 శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్ ఏడేండ్ల‌లో 10శాతం కూడా కంప్లీట్ చేయ‌లేదన్నారు. ప్రాజెక్టు పూర్త‌యితే వైఎస్సార్ కు పేరు వ‌స్తుంద‌ని ప‌నులు పూర్తి చేయ‌డం లేదని.. ఈ ప్రాంతంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారికి ఎంతో మంది అభిమానులున్నారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version