బీజేపీలో చేరుతా : కోమటిరెడ్డి సంచలనం

-

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిజేపి బలపడుతుందని ముందుగా చెప్పిన వ్యక్తిని నేనేనాన్న ఆయన రాబోయే రోజుల్లో బిజేపిలో చేరుతానని చెబుతూ సంచలనం రేపారు.  వెంకటరెడ్డి కాంగ్రెస్ ని వీడరన్న ఆయన పీసీసీ అధ్యక్షుడు పదవికి రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి పోటిలో వున్నారని ఆయన అన్నారు.

నిర్ణయం అధిష్టానందేనన్న ఆయన తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ శోభించకూండా కేసిఆర్ పరిపాలన చెయ్యాలి… తన నిర్ణయాలను పున:సమిక్షించుకోవాలని కోరారు. ఇక పీసీసీ అధ్యక్ష్యుడు ప్రకటన త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న క్రమంలో ఆయన రాగానే ఈ పీసీసీ అధ్యక్ష్యుడి ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. సోనియా ఇక్కడే ఉన్నా దానిని రాహుల్ వచ్చాకనే ప్రకటిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఈ పదవి ఎవరిని వరిస్తుందో ? 

Read more RELATED
Recommended to you

Exit mobile version