మునుగోడు బై పోల్‌..కాంగ్రెస్‌ కు బిగ్‌ షాకిచ్చిన కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి !

-

మునుగోడు బై పోల్‌ తరుముకొస్తున్న తరుణంలో..కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాకిచ్చారు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు షాక్ తగిలిందనే చెప్పవచ్చు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.

ఈ నెల 15న ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటివరకు మునుగోడులో అడుగుపెట్టని సిట్టింగ్ ఎంపీగా వెంకట్ రెడ్డి నిలిచారు. అంతేకాకుండా మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ తరువాతే హైదరాబాద్ తిరిగి వస్తారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విదేశీ పర్యటనకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. బైపోల్ ఫలితాల తర్వాత కోమటిరెడ్డి ఇండియాకు వస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version