హుజురాబాద్ లో యాక్టర్, హైదరాబాద్ లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్ – కౌశిక్ రెడ్డి

-

హుజురాబాద్ లో యాక్టర్, హైదరాబాద్ లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్ అని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ అభివృద్ధి కి బిజెపి అధికారంలో ఉన్న కేంద్రం నుంచి 100 కోట్లు ఈటల తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు మేము రాష్ట ప్రభుత్వం నుంచి రూ.150 కోట్లు ఇస్తామన్నారు.

koushik reddy

నేను జూనియర్ అంటున్నావు… మరి కేసీఆర్ తో నీకు పోటీ ఏంటి ? అని ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి..ఈటలపై ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు ఈటల కామెంట్ చేస్తున్నారని.. ఈటల పెద్ద మోసగాడు…కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహించారు.

హుజురాబాద్ ప్రజలకు కూడా ఇప్పుడు ఈటల వెన్నుపోటు పొడుస్తున్నాడని.. ఈ నెల 5 న హుజురాబాద్ కు చర్చకు ఈటల రాకపోతే…ఆయన అభివృద్ధి చేయలేదని అంగీకరించినట్టునని చురకలు అంటించారు. నియోజకవర్గములోని అన్ని శిలాఫలకలపై ఈటల పేరు ఉందని… ఈటల రాజేందర్ నీకు హుజురాబాద్ ప్రజలు ఏమి అన్యాయం చేశారని గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని అంటున్నావు ? అని నిప్పులు చెరిగారు. ఆగస్టు 5 న హుజురాబాద్ అభివృద్ధి పై చర్చకు ఈటల రాజేందర్ రావాలని.. దమ్ము ఉంటే నేను విసిరిన సవాల్ ను ఈటల రాజేందర్ స్వీకరించాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version