టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతి ఒక్కరు ప్రపంచంతో పోటీ పడాల్సిందే : కేటీఆర్

-

టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని.. ప్రతి ఒక్కరు ప్రపంచంతో పోటీ పడాల్సిందేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులు ఆలోచనలకు పదునుపెడితే ప్రపంచమే అబ్బురపడేలా ఆవిష్కరణలు చేయవచ్చని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్..  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన ‘గిఫ్ట్‌-ఎ-స్మైల్‌’ కార్యక్రమంతో పాటు బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొన్నారు.

సాంసంగ్‌, ఆకాశ్‌ బైజూ సంస్థలు సిరిసిల్ల కళాశాల ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేసేందుకు ముందుకొచ్చాయి. ‘గిఫ్ట్‌-ఎ-స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా తొలి రెండు విడతల్లో.. అంబులెన్స్‌లు, త్రిచక్రవాహనాలను అందించగా.. మూడో విడతలో సాంసంగ్‌, ఆకాశ్‌ బైజూ సంస్థలు ఈ ల్యాప్‌టాప్‌లను అందించాయి.

ఈ ల్యాప్‌టాప్‌లనే మంత్రి కేటీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు అందజేశారు. ప్రపంచంతో పోటీపడుతూ.. విద్యార్థులు చదువులు సాగించాలని కేటీఆర్ సూచించారు. ఉన్నత విద్యలో, ఆవిష్కరణల్లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల నుంచి మరింతగా వస్త్రాల ఉత్పత్తి పెరగాలని  సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version