రూ.18వేల కోట్లు రాలేదని..గుండు సంజయ్‌పైన ఒట్టు వేయ్‌..లేదా మోడీపైన వేయ్‌ – కేటీఆర్‌

-

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి కేటిఆర్ సవాల్‌ విసిరారు. మునుగోడు కు కేంద్రం 18వేల కోట్ల నిధులు ఇస్తే ఉప ఎన్నిక నుండి తప్పుకుంటామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌. లేదంటే 18 వేల కోట్ల కాంట్రాక్టులు రాలేదని.. హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడికి వచ్చి…మీ గుండు సంజయ్ మీద ఒట్టు వెయ్యి… లేదంటే యాదాద్రి కి వచ్చి మీ మోడీ మీద ఒట్టు వెయ్యి అని ఛాలెంజ్‌ చేశారు కేటీఆర్‌.

ఇక్కడ ఎవడేవేడో వచ్చి రాజకీయాలు చేస్తారు…కానీ తెలంగాణ వాళ్ళు దేశంలో రాజకీయాలు చేయడం తప్పా ? అని నిలదీశారు. ఫైనల్ ఎగ్జామ్ ముందు…మునుగోడు ఉప ఎన్నిక యూనిట్ టెస్టు అన్నారు. బిజెపి అప్పనంగా కాంట్రాక్టులు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణకు ఒప్పుకోవాలని ఆగ్రహించారు. కేసీఆర్ మునుగోడు కు ఏమి చేశాడు అన్న సన్నసులకు చెప్పాలిసిన అవసరం ఉందని.. ఇటీవలే కేంద్రము అవార్డులు ఇస్తే…చండూరు మునిసిపాలిటీకి అవార్డు వచ్చిందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version