మరో కమెడియన్ కనిపించాడు… రాజా సింగ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

-

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ ఏమాత్రం దిగజారలేదు అని అనుకున్నప్పడు.. మరో అద్భుతమైన కమెడియన్ కనిపించాడని.. ట్విటర్ లో వ్యాఖ్యానించాడు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను కమెడియన్ తో పోల్చాడు. మీరు బీజేపీకి ఓటు వేయకుంటే యోగి మీ ఇంటిని కూల్చేస్తాడు/బుల్డోజ్ చేస్తాడని తెలంగాణకు చెందిన ఈ బీజేపీ ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ అంటున్నారని ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. 

రాజాసింగ్ యూపీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేయకుంటే యోగీజీ జేబీలు, బుల్డోజర్లలో మీ ఇళ్లను కూల్చేస్తారంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఉండాలంటే.. యోగీ అనాల్సిందే అని అన్నారు. యోగీకి ఓటేయని ఏరియాలను గుర్తిస్తామంటూ.. ఓటర్లను హెచ్చరించారు. యోగీకి ఓటేయని వారు యూపీ నుంచి పారిపోవాలంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మంత్రి కేటీాఆర్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ… కమెడియన్ తో రాజసింగ్ ను పోల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version