Warangal: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే సీతక్క

-

ములుగు ఎమ్మెల్యే సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ములుగు బస్టాండ్ నుంచి మేడారానికి బస్సులో ప్రయాణించి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని, ప్రతి ఒక్కరూ ఆర్టీసీని ఆదరించాలన్నారు. జాతర సమయంలో తల్లులను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సీతక్క వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version