విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు.. అవసరం అయితే విశాఖకి కేటీఅర్ !

-

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అవసరం అనుకుంటే విశాఖ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామని కేటీఆర్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తూ ఆంధ్రకు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని కేటీఆర్ తెలిపారు.   ఆంధ్రుల హక్కు… విశాఖ హక్కు… అని సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటు పరం చేశారని విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉందని అన్నారు. వీలైతే… వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామన్న ఆయన మా అందరి మద్దతు ఉంటుందని, పోరాటంలో కలిసి ఉంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version