బండి సంజయ్ కి… జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు- కేటీఆర్

-

బండి సంజయ్ కి…. జేపీ నడ్డాకు తేడా లేదని, నడ్డాను ఇన్నాళ్లు పెద్ద మనిషి అనుకున్నానని.. చిల్లరగా మాట్లాడారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నిన్న జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. జేపీ నడ్డా నువ్వో అబద్దాల అడ్డా అని, నిన్ను ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించాలని తీవ్ర విమర్శలు చేశారు. మోడీ పాలన సబ్ కా వికాస్ కాదని .. సబ్ కా వినాశ్ అని విమర్శించారు. రైతులను గోస పెట్టింది నరేంద్ర మోదీ నే అని.. దేశంలో ఏ ప్రధాని కూడా రైతుల్ని ఈరకంగా ఇబ్బంది పెట్టలేదని కేటీఆర్ అన్నారు.

నిన్న రైతుల్ని రెచ్చగొట్టిన బీజేపీ ప్రస్తుతం ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దేశంలో మా పథకాలను కాపీ కొడుతున్నారని అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి మా ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబంధుకు కాపీ కాదా అని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఏటీఎం అని, రైతులకు, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version