రాజీవ్ గాంధీ లేకుంటే కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయ్యేవారా..? : సీఎం రేవంత్ రెడ్డి

-

రాజీవ్ గాంధీ లేకుంటే కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయ్యేవారా..? అని ప్రశ్నించారు  సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు. కంప్యూటర్ ను ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాందీ కంప్యూటర్ ను పరిచయం చేయకుంటే.. చాయ్, ఇడ్లీ, వడ అమ్ముకుంటోనివి అని కేటీఆర్ నుద్దేశించి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి.  కొందరూ తండ్రులను అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం గురించి బలుపు మాటలు మాట్లాడుతున్నారు. పదవీ త్యాగం అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీదే అన్నారు. 

సోనియాగాంధీ పీ.వీ.నరసింహారావును ప్రధాని చేస్తే.. రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.  ఆ పక్కన బుద్దుడు.. ఈ పక్కన బుద్దిలేనిడిని విగ్రహం పెట్టుకోవాలని వాళ్లు అనుకున్నట్టుందని సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version