రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేది అప్పుడే..!

-

రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అక్టోబర్ నెలలో  కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్ కార్డుకు అర్హులు ఎవ్వరూ అనేది వచ్చే భేటీలో నిర్ణయిస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పారదర్శకంగా రేషన్ కార్డులు అందజేస్తాం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను అందజేస్తామని తెలిపారు.

ఈనెల 21న క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో చర్చించి స్మార్ట్ రేషన్ కార్డు, స్మార్ట్ హెల్త్ కార్డులను అందజేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఎవ్వరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని పేర్కొన్నారు. రేషన్ కార్డుల కోసం పేద ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version