పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే చట్టం తనపని తాను చేసుకుపోతుంది – మంత్రి బొత్స

-

నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి ఉగ్రవాదిని ఇంకొకరిని చూడరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని కౌంటర్ వేశారు. పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని వ్యాఖ్యానించారు.

ఎవరిని కొడతాడు..? ఎవరిని బెదిరిస్తాడు..? రిపబ్లిక్ డే రోజున ఎవరైనా హుందాగా మాట్లాడతారు కానీ.. పవన్ కళ్యాణ్ సన్నాసి మాటలు మాట్లాడి మా చేత కూడా మాట్లాడిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే రాజకీయాలపై విరక్తి కలుగుతుందన్నారు. అసలు పవన్ కళ్యాణ్ కి సబ్జెక్ట్ లేదని, ఆ పార్టీకి ఓ విధానం లేదని అన్నారు. ఆయన ఆవేశపడితే ఎవరు బెదురుతారని.. కేఏ పాల్ కి, పవన్ కళ్యాణ్ కి పెద్ద తేడా లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఆపమంటున్నాడు.. నిన్ను ఎవడు ఆపుతాడు, ఎవడు అడ్డుకుంటాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version