21 మంది మాజీ హై కోర్ట్ న్యాయమూర్తులు లేఖ… “స్వలింగ వివాహాలు వద్దు”

-

మనదేశం ఎటు పోతోంది… ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న భారతదేశం నేడు పాశ్చాత్య సంస్కృతులకు ఆకర్షితులై రోజు రోజుకీ మరీ దారుణంగా సభ్య సమాజం తలదించుకునే పద్ధతులకు అలవాటు పడిపోతున్నారు. అందులో ఒకటి స్వలింగ వివాహాలు… మన సంప్రదాయం ప్రకారం స్త్రీ పురుషులు వివాహం చేసుకోవడం. కానీ ఇప్పుడు పురుషుడు మరో పురుషుడిని , అలాగే స్త్రీ మరో స్త్రీని వివాహం చేసుకుంటున్నారు. పైగా ఈ విషయాన్ని సుప్రీమ్ కోర్ట్ కూడా సమర్ధించింది.

అయితే భారతదేశంలో ఉన్న 21 మంది హై కోర్ట్ మాజీ న్యాయమూర్తులు ఈ పద్ధతి సరైంది కాదు అని అభిప్రాయపడుతున్నారు. దీని వలన సమాజానికి చాలా నష్టం కలుగుతోంది అంటూ బాధపడుతున్నారు. ఈ విధమైన సంస్కృతులు మన దేశాన్ని నాశనం చేస్తాయని… స్వలింగ సంపర్కం వలన HIV కూడా పెరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అందుకే దయచేసి ఈ విషయంపైన పిటిషన్ వేసిన వారు కూడా వెనక్కు తీసుకోవాలని లెటర్ రాయడం జరిగింది. మరి వారిలో ఏమైనా మార్పు వస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version