లోకేష్ స్కెచ్..వైసీపీని కవ్విస్తున్నారా?

-

గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి నారా లోకేష్ వైఖరిలో మార్పు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు వరకు తడబడుతూ తప్పులు మాట్లాడే లోకేష్..మాట తీరు తర్వాత చాలా మారింది. ఇక ఇప్పుడు పాదయాత్రలో ఆయన శైలి పూర్తిగా మారిపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే పాదయాత్రకు రాష్ట్ర స్థాయిలో మాత్రం హైప్ రాలేదు..కాకపోతే స్థానికంగా బాగానే హైలైట్ అవుతుంది. అంటే లోకేష్ పాదయాత్ర ఏ  నియోజకవర్గంలో జరిగితే..అక్కడ వరకు సక్సెస్‌ఫుల్ గానే నడుస్తోంది.

ప్రజలని కలుస్తూ..ప్రజా సమస్యలని తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. అదే సమయంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకుని లోకేష్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. పైగా వైసీపీ నేతలని కవ్విస్తున్నట్లు తెలుస్తోంది. మామూలుగానే కొందరు వైసీపీ నేతలు ఏ స్థాయిలో చంద్రబాబుని గాని, లోకేష్‌ని గాని తిడతారో తెలిసిందే. అలాంటి నేతల జోలికి వెళ్ళడం వల్ల మళ్ళీ వారు తిడతారని తెలుసు. అయినా సరే లోకేష్ కావాలనే అలాంటి వైసీపీ నేతలని కవ్విస్తున్నట్లు తెలుస్తోంది.

అందులోనూ రోజా లాంటి వారిని కవ్విస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. నగరిలో పాదయాత్ర చేసేటప్పుడు రోజాని టార్గెట్ చేసుకుని లోకేష్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. డైమండ్ పాప అంటే ఫీల్ అవుతున్నారని, అందుకే జబర్దస్త్ ఆంటీ అంటానని లోకేష్ సెటైర్లు వేశారు. ఇక నగరిలో రోజా అక్రమాలకు అంతు లేదని ఆరోపించారు.

దీంతో రోజా కూడా లోకేష్ కౌంటర్ ఇచ్చారు..లోకేష్ అంకుల్ అని..తాను ఆంటీ అయితే లోకేష్ భార్య, అమ్మ ఏంటి? అని ప్రశ్నించారు. ఇలా రోజా రివర్స్ లో విమర్శలు చేస్తారనే లోకేష్ వ్యూహాత్మకంగా విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తన పాదయాత్ర హైలైట్ అవుతుందనే కాన్సెప్ట్ లో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version