IPL 2024: మయాంక్ విజృంభణ.. లక్నో చేతిలో ఘోరంగా ఓడిపోయిన బెంగళూరు

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అనూహ్యంగా ఆర్సిబి దారుణంగా ఓడిపోయింది. దీంతో బెంగళూరు పై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది లక్నో సూపర్ జెంట్స్. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్నిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.

Lucknow Super Giants won by 28 runs

ఓపెనర్ డికాక్ ఏకంగా 81 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అటు pooran కూడా 40 పరుగులు చేసి భారీ స్కోర్ అందించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు దారుణంగా విఫలమైంది. లక్ష్య చేదనలో 153 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ఆర్సిబి. విరాట్ కోహ్లీ 22 పరుగులు, పాటిదర్ 29 పరుగులు, లూమ్రార్ 33 పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు. ఇక లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ మరోసారి మెరిశాడు. తన స్పీడుతో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు మయాంక్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news