చిరు వ్యాపారుల కొంపముంచిన లులు మాల్..!

-

చిరు వ్యాపారుల కొంపముంచిన ‘లులు’ మాల్… పాపం 30 సంవత్సరాల జీవనాధారం 30 సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారి పైన అధికారులు కర్కషంగా వ్యవహరించి సోమవారం రోజున ఫుట్ పాత్ ఆక్రమణ పేరిట ఎటువంటి సమాచారం లేకుండా సుమారు 200 కుటుంబాలకు చెందిన వ్యాపారాలను తొలగించారు. ఇది దారుణమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్యలు ఎలా చేపడుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version