రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చింది : కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు

-

రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చిందని మాజీ కేంద్రమంత్రి పళ్లం రాజు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 10 సీట్లలో పాజిటివ్ మూడ్ ఉందని.. జాతీయ స్థాయిలో నాయకులు చాలా బిజీగా ఉన్నారని తెలిపారు. చింతామెహన్ ది వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. చింతా మోహన్ కూటమిదే పై చేయి అంటున్నారు.

తెలుగుదేశం కు జనసేన అండగా కలసి వచ్చిందని తెలిపారు. బిజెపి తో పొత్తు తెలుగుదేశం కూటమికి నష్టం కలిగే అవకాశముందని.. దేశ రాజకీయాల్లో బిజెపి రాకపోవచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.  జాతీయస్ధాయిలో కాంగ్రెస్ 150, కూటమి తో కలిపితే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపారు. ఇండియా లో కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version