బాలకృష్ణను కలిసిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి… ఫోటోలు వైరల్

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటిచేసి గెలుపొందిన విషయం తెలిసిందే.ఇప్పటికే హిందూపురం నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ తాజాగా హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇంకోపక్క బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి,టాలీవుడ్ నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం విజయవాడలో ఉన్న బాలకృష్ణను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కలిశారు. ఈ క్రమంలో జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మర్యాద పూర్వకంగా బాలయ్యను కలిసినట్టు చెబుతున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి మీద జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గట్టి మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version