ఒకప్పుడు రాజధాని లేని రాష్ట్రం…. కానీ ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రం అంటూ వైసీపీపై పురందేశ్వరి సెటైర్లు

-

రాజధాని లేని రాష్ట్రంగా ఒకప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్నామని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సెటైర్లు వేశారు.

ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీ తరపున దగ్గుపాటి పురందేశ్వరి సత్కరించారు. అమరావతిలో నిర్వహించిన బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభలో పురంధేశ్వరి మాట్లాడుతూ కూటమి విజయం ప్రతి ఒక్కరిదని అన్నారు. అహంకార, అరాచకం పాలనతో విసుగెత్తిన రాష్ట్ర ప్రజలు బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమిపై గల విశ్వాసం తో మనకు ఓట్లు వేసి గెలిపించారని, మూడు పార్టీల ఉమ్మడి నినాదంతో అభివృద్ధి, సంక్షేమం కలగలిసిన పాలనను ప్రజలకు అందించాలి.సబ్ కా సౌత్, సబ్ కా వికాస్ తన నినాదమని పురంధేశ్వరి స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version