హ‌ర్ ఘ‌ర్ తిరంగా.. గ‌ర్వంగా భావిద్దాం : మహేశ్‌బాబు

-

బీజేపీ ప్రభుత్వం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 13 నుంచి 15 వ‌ర‌కు దేశ ప్ర‌జ‌లంతా త‌మ ఇళ్ల‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించాలంటూ కేంద్రం పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. హ‌ర్ ఘ‌ర్ తిరంగా పేరిట దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం హోరెత్తుతోంది.

ఈ ప్రచారంలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూడా పాలుపంచుకున్నారు. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. త్రివ‌ర్ణ ప‌తాకం మ‌న గ‌ర్వకార‌ణ‌మ‌ని పేర్కొన్న ఆయ‌న త్రివ‌ర్ణ జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేద్దామంటూ అంద‌రం ప్ర‌తిజ్ఞ చేద్దామంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. హ‌ర్ ఘ‌ర్ తిరంగా హ్యాష్ ట్యాగ్‌ను ఆయ‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version