‘ప్రతిరోజూ నీకు కృతజ్ఞుడునే అమ్మా..’ తల్లి పై మహేష్ ఎమోషనల్ పోస్ట్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో గత ఏడాది ఎన్నో విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. వరుస విషాదాలతో మహేష్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది అతని తల్లి ఇందిరాదేవి మరణించారు. అయితే ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా తల్లిని తలుచుకొని మహేష్ బాబు ఒక ఎమోషనల్ పోస్టును ఉంచారు.

 

గత ఏడాది మహేష్ బాబు కుటుంబంలో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ అన్న రమేష్ బాబు మరణించిన కొన్ని నెలలకి తల్లి ఇందిరాదేవి మరణించగా గత ఏడాది చివరిలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ తండ్రి కృష్ణ గారు మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఒకే ఏడాది కుటుంబంలో సంభవించిన మూడు మరణాలతో మహేష్ బాబు ఎంతో బాధను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మెల్లగా వాటి నుంచి కోలుకుంటూ బయటకు వచ్చి సినిమాల్లో బిజీ అయ్యారు. అయితే ఈరోజు ఇందిరాదేవి పుట్టినరోజు కావడంతో తల్లితో ఉన్న ఒక ఫోటోను పంచుకున్న మహేష్ ఓకే ఎమోషనల్ కోర్టును ఉంచారు.

మహేష్ తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకుంటూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ. ప్రతిరోజూ నీకు కృతజ్ఞుడను’. అంటూ ఎమోషనల్ అయ్యారు. ఏడాది పుట్టినరోజు సందర్భంగా తీసిన ఫోటోను ఉంచిన మహేష్ తల్లిని గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version