డైరెక్ట్‌గా OTTలోకి మెగాస్టార్ ఫిల్మ్..ఆ రోజు నుంచి స్ట్రీమింగ్

-

మాలీవుడ్(మలయాళ) మెగాస్టార్ మమ్ముట్టి..చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. విభిన్న చిత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు మమ్ముట్టి. ఈ క్రమంలోనే ఇతర భాషల్లోనూ పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంటారు. ప్రస్తుతం ఆయన తెలుగులో అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ ఫిల్మ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Mammootty

మమ్ముట్టి నటించిన సినిమా విడుదల అయితే చాలు..తప్పక చూడాల్సిందే అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మెగాస్టార్. కాగా, ఆయన నటించిన థ్రిల్లర్ ‘పుజు’ డైరెక్ట్ గా OTTలోనే రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.

ఇటీవల ఈ పిక్చర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తండ్రీ కొడుకుల నేపథ్యంలో జరిగే సంభాషణలు ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. రతీనా పీటీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈపిక్చర్ ను మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఓన్ ప్రొడక్షన్ హౌజ్ వేఫేరర్ ఫిల్మ్స్, సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

ఈ ఫిల్మ్ ఈ నెల 13 నుంచి సోన్ లివ్ OTTలో స్ట్రీమింగ్ కానుంది. మమ్ముట్టి నటించిన చిత్రాలు ‘భీష్మ పర్వం, సీబీఐ5 ది బ్రెయిన్’ ఇటీవల విడుదలై చక్కటి ఆదరణ పొందాయి. ‘భీష్మ పర్వం’ చిత్రంతో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version