దారుణం : కొడుకు దాడి, తల్లి మృతి, అపస్మారకస్థితిలో తండ్రి !

-

ఈ మధ్య కాలంలో డబ్బు కోసం దేనికి అయినా తెగిస్తున్నారు కొందరు. ఆ డబ్బు కోసం చావడానికి అయినా చంపడానికి కూడా వెనకాడడం లేదు. రోజు రోజుకీ ఆ డబ్బు కోసం లేదా ఆస్తుల కోసం తల్లి తండ్రుల మీద దాడి చేస్తున్న వారి లిస్టు పెరుగుతూ పోతోంది. తాజాగా కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురమొండిలో దారుణం జరిగింది.

తమ్ము వీరరాఘవయ్య అనే యువకుడు… తల్లితండ్రులపై కట్టెలతో దాడి చేశాడు. ఈ దాడి ఘటనలో తల్లి వీరలంకమ్మ స్పాట్‌లోనే చనిపోగా.. తండ్రి నాగేశ్వరరావు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ విభేదాల కారణంగా ఈ దారుణం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇరుగుపొరుగు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండడంతో.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version