సీఎం జగన్ ను ట్రోల్ చేసిన మంచు లక్ష్మీ.. ఆడుకుంటున్న వైసీపీ ఫ్యాన్స్ ..!!

-

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచులక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమెరికాలో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చాక లక్ష్మీ టాక్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి వంటి సినిమాల్లో మెరిసింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మంచులక్ష్మీ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి అందరికీ తెలుసు.

అయితే తాజాగా మంచులక్ష్మీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ జనసేన పార్టీ కార్యకర్త సీఎం జగన్మోహన్ రెడ్డిని టోల్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఎగ్జామ్ హాల్ లో పరీక్ష పేపర్ చూసిన నా పరిస్థితి ఇది అంటూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను సాయి తేజ అనే జనసేన అభిమాని ట్వీట్ చేశారు.

ఆ వీడియోలో సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ, అటు ఇటు చూస్తున్నారు. ఈ పోస్టును రీట్వీట్ చేసిన మంచు లక్ష్మీ ప్రసన్న, పగలబడి నవ్వుతున్నట్లు Lol అంటూ రియాక్షన్ ఇచ్చారు. దీంతో సీఎం జగన్ మీరు కూడా ట్రోల్ చేస్తారా అంటూ వైసీపీ అభిమానులు ఫైర్ అయ్యారు. నీకు కొంచమైనా సిగ్గు ఉందా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అలా అంటావా అని వైసిపి కార్యకర్తలు మరియు నెటిజెన్లు సీరియస్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version