మంచు విష్ణు సినిమా పై కుట్ర జరుగుతోందా..!!

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా వస్తున్న చిత్రం   జిన్నా. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి కథ తో, కొత్త డైరెక్టర్ ఈశాన్ సూర్య డైరెక్షన్ చేశారు.ఈ సినిమాలో  అందాల ముద్దగుమ్మలు పాయల్ రాజ్ పుత్, సన్ని లియోన్లు నటిస్తున్నారు. ఈ సినిమా కోసం  ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.

ఇప్పుడు సినిమా పై కుట్ర జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ మూవీ పై రివ్యూస్.. పబ్లిక్ టాక్స్ ఇచ్చేశాయట. అలాంటి కొన్ని చానల్స్ ను గుర్తించిన మంచు విష్ణు.. వాటి లింక్స్ మరియు పేర్లను  తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే తాను ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ అనుకున్నట్లుగానే మా కుటుంబం మీద కుట్ర జరుగుతోంది.ఇదిగో ‘పెయిడ్ బ్యాచ్’ వివరాలు మీ ముందుకు తీసుకువచ్చాను. నేను నటించిన జిన్నా సినిమా ఇంకా రిలీజ్ అవ్వనే లేదు. కాని అప్పుడే పెయిడ్ బ్యాచ్ నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకు నాపై అంత ద్వేషం? . మేము త్వరలో వారి ఛానెల్‌లను మూసివేస్తామని వారు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు. అన్నట్లు గానే వారి మీద సైబర్ క్రైమ్ వారికి పిర్యాదు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version