బీజేపీ లో చేరిన ప్రముఖ యూట్యూబర్..!

-

పార్లమెంట్ ఎన్నికల వేళ బిజెపిలో చేరికలతో జోష్ పెరుగుతుంది. బీహార్ కి చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ ఈరోజు భారతీయ జనతా పార్టీ లో అధికారికంగా చేరారు. మనోజ్ తివారి, అనిల్ బలుని సమక్షం లో ఆయన బీజేపీ లో చేరినట్లు తెలుస్తోంది. గతం లో మనీష్ కశ్యప్ ఒక నియోజకవర్గం నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. నేను నిన్న మనోజ్ తివారితో కలిసి బీహార్ నుండి వచ్చాను వారి వల్ల మాత్రమే నేను జైలు నుండి బయటకు రావడం సాధ్యమైంది. నా జీవితంలో చెడ్డ రోజులు ముగిసిపోయాయి నేను బిజెపిలో చేరాను బీహార్ ని దోచుకుని ధ్వంసం చేసిన బీహార్ ని బలపరచాలి అందుకు నేను నా మంది కృషి చేస్తాను అని మనీష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version