నన్ను చంపాలని చాలామంది చూస్తున్నారు – కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

-

తనని చంపాలని చాలామంది చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మీద ఇప్పటివరకు ఆరు కేసులు గెలిచానని.. ఇంకా కేసీఆర్ పై కేసులు ఉన్నాయి… నేను ఓడిపోలేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పగలనకా రాత్రి అనక తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నానని వివరించారు. ట్రంప్ అరెస్ట్ అవుతారని గతంలోని నేను చెప్పానన్నారు.

తనపైన సిరిసిల్లలో దాడి చేసిన వారిపై ఇప్పటివరకు అరెస్టు చేయలేదని.. అనిల్ కుమార్ నాపైన మర్డర్ అటెంప్ట్ చేశాడు… దీనిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టినరోజున అంబేద్కర్ సెక్రటేరియట్ ఓపెన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో తాను ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్న అడ్డుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై లేనిపోని కేసులు పెడుతుందని ఆరోపించారు కేఏ పాల్. తనని చంపించాలని చాలామంది చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version