Pro Kabaddi 2019: గుజరాత్ పై గెలిచిన ముంబై.. తెలుగు టైటన్స్ మ్యాచ్ టై..!

-

ఈరోజు పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంతర్స్ మధ్య రాత్రి 7.30 పాట్నాలోని పాట్లలిపురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మ్యాచ్ జరగనుంది. మరో మ్యాచ్ బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరగనుంది.

ప్రో కబడ్డీ 2019 ఏడో సీజన్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే 22 మ్యాచులు పూర్తయ్యాయి. నిన్న రెండు మ్యాచులు జరిగాయి. ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలో యూ ముంబా, గుజరాత్ మధ్య పోరు జరిగింది. ఈ పోరులో ముంబై.. గుజరాత్ ను ఓడించింది. 32-20 తేడాతో ముంబై గెలిచింది.

అంతకుముందు… అదే స్టేడియంలో తెలుగు టైటన్స్, యూపీ యోధా మధ్య పోరు జరిగింది. అయితే.. ఈ పోరు టై అయింది. రెండు టీమ్ లు చెరో 20 పాయింట్లు చేయడంతో మ్యాచ్ టై అయింది.

ఈరోజు పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంతర్స్ మధ్య రాత్రి 7.30 పాట్నాలోని పాట్లలిపురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మ్యాచ్ జరగనుంది. మరో మ్యాచ్ బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరగనుంది. రాత్రి 8.30కు పాట్నాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోనే మ్యాచ్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version