యాత్ర-2 సినిమా దర్శకుడికి మంత్రి అంబటి సత్కారం

-

దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో తమిళ నటుడు జీవ వైఎస్ జగన్ పాత్రలో నటించిన తాజా చిత్రం యాత్ర 2. ఇదివరకే 2019 ఎలక్షన్స్ కి ముందు యాత్ర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రము మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వల్ గా ఎన్నికల ముందు యాత్ర 2 ను విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో యాత్ర- 2 మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ మహి వి రాఘవ్ను మంత్రి అంబటి రాంబాబు సత్కరించారు. మంచి సినిమాను అందించిన మహికి ధన్యవాదాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఈ చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలు తన గుండెను పిండేశాయని ఆయన ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version