సంఘం డైరీని స్వాధీనం చేసుకుంటాం – మంత్రి అప్పలరాజు

-

సంఘం డైరీ ధూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు. వడ్లమూడి లో ఉన్న సంఘం డైరీ ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. సంఘం డైరీ ప్రభుత్వ ఆస్తి అని, అది ప్రజల సొత్తు అని చెప్పిన ఆయన.. త్వరలోనే రైతులకు డైరిని ఇస్తామన్నారు. చంద్రబాబు ఒక పథకం ప్రకారం రాష్ట్రంలోని సహకార సంఘాలలో ఉన్న పాల డైరీలను తన వాళ్లకు కట్టబెట్టాడని ఆరోపించారు.

రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో చంద్రబాబుకు పిచ్చెక్కిందన్నారు. ఇక ఎన్నికల సమయం నాటికి చంద్రబాబు పిచ్చి ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరులో పశువైద్యశాలను ప్రారంభించిన మంత్రి.. రాష్ట్రంలో 3600 మిల్క్ చిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, పశువులకు సత్వర వైద్యం కోసం అంబులెన్సులు అందుబాటులోకి తెస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version