మోదీ చిల్లర మాటలు మాట్లాడారు : మంత్రి హరీష్‌ రావు

-

ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసి బహిరంగ సభలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలన చేసేవారు దేశద్రోహులు అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో.. మోడీ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి హరీష్‌ రావు.. సిల్వర్ జూబ్లీ కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన మోదీ చిల్లర మాటలు మాట్లాడారని హరీష్‌ రావు విమర్శించారు.

మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతోనే బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం మోదీ మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు హరీష్‌ రావు. మోదీ నోట కుటుంబ పాలన మాట రావడం హాస్యాస్పదంగా ఉందని హరీష్‌ రావు పేర్కొన్నారు. అమిత్ షా తనయుడు ఏమైనా క్రికెట్ ఆటగాడా? ఆయన బీసీసీఐకి ఎలా కార్యదర్శి అయ్యాడు? అని హరీశ్ రావు నిలదీశారు హరీష్‌ రావు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదని, తెలంగాణను ఓ కుటుంబంలా భావించి పాలిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని హరీష్‌ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version