ఆ ఆసుపత్రిని ఆకస్మీకంగా తనిఖీ చేసిన మంత్రి హరీష్‌రావు

-

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మంత్రి హరీష్‌ తనదైన శైలితో ముందుకు వెళుతున్నారు. అయితే నేడు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి హరీష్‌ రావు సందర్శించారు. మంత్రి ఆకస్మిక రాకకు ఖంగుతిన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కొంత ఆయోమయానికి లోనైయ్యారు. అయితే ఈ నేపథ్యంలో వార్డులు తిరుగుతూ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెల్సుకున్న మంత్రి హరీశ్ రావు.. పేషెంట్లతో ఆప్యాయంగా మాట్లాడి, త్వరగా కోలుకుంటారు అని ధైర్యం చెప్పారు.

అంతేకాకుండా డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి పేషెంట్లకు పలకరించారు. డయాలసిస్ జరుగుతున్న తీరు పరిశీలించారు మంత్రి హరీష్‌ రావు. మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలి ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేద ప్రజలు ఎంతో నమ్మకంతో ఆసుపత్రి వస్తారని, వారికి మంచి సేవలు అందించాలని వైద్య సిబ్బందికి మంచి సూచనలు చేశారు మంత్రి హరీష్‌ రావు. అనంతరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను మంత్రి హరీష్‌ రావు తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version