వాళ్లకు ఓట్లేస్తే మన ఘోరీలను మనం కట్టుకోవడమే – జగదీష్ రెడ్డి

-

ఫ్లోరోసిస్ భూతంతో మునుగోడును జీవచ్ఛవంగా మార్చింది కాంగ్రెస్, బిజెపి లేనని ఆరోపించారు మంత్రి జగదీశ్ రెడ్డి. అటువంటి పార్టీలకు ఓట్లు వేయడం అంటే.. మన గోరీలను మనం కట్టుకోవడమేనని అన్నారు. ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతోందని కొనియాడారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి లో జరిగిన టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు పెడతామని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని అన్నారు.

రాజగోపాల్ రెడ్డి తప్పుడు మాటలతో మీ దగ్గరకు వస్తారని అన్నారు. మునుగోడు లో కనుక బిజెపి గెలిస్తే.. మోటార్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు. ఏమీ ఇవ్వకుండా ఉన్న పథకాలను రద్దు చేస్తూ ఎగిరెగిరి పడుతున్న బిజెపిని చూస్తున్నామన్నారు. బిజెపితో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మునుగోడు లో భారీ మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version