పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన వ్యక్తి వైఎస్సార్ : మంత్రి జోగి రమేశ్

-

పేదలకు సేవ చేశాడు కాబట్టే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరుపెడుతున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంపై ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన వ్యక్తి వైఎస్సార్ అని, వైద్య రంగంలో గొప్ప సంస్కరణలు తెచ్చారని వెల్లడించారు మంత్రి జోగి రమేశ్. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఆరోగ్య భరోసాను అందిస్తే, 108 సర్వీస్ ద్వారా వేలమంది ప్రాణాలు నిలిచాయని వివరించారు మంత్రి జోగి రమేశ్. పేదలకు సేవ చేశాడు కాబట్టే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరుపెడుతున్నామని తెలిపారు మంత్రి జోగి రమేశ్.

వివాదం సృష్టించడానికి టీడీపీ నేతలు రోజుకొక అంశాన్ని ఎంచుకుంటారని, ఇవాళ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లుపైనా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి జోగి రమేశ్. ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంటే నాడు చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారని టీడీపీ నేతలను నిలదీశారు మంత్రి జోగి రమేశ్. పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని విమర్శించారు మంత్రి జోగి రమేశ్. కానీ సీఎం జగన్ కు ఎన్టీఆర్ పై నిజమైన ప్రేమ ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని తెలిపారు మంత్రి జోగి రమేశ్. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version