రెండు లక్షలకు పైగా ఉన్న రుణమాఫీ మార్చిలో : మంత్రి పొన్నం

-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజా పాలన వార్డు సభను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా కొన్ని కీలక కామెంట్స్ చేసారు మంత్రి. రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదు అని పేర్కొన్న ఆయన.. న్యాయంగా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తాం అని అన్నారు. అలాగే అధికారులు ప్రజా పాలన సభల్లో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలి అని ఆదేశాలు ఇచ్చారు.

ఇక రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నాం అని పేర్కొన్న మంత్రి.. రెండు లక్షలకు పైగా ఇంకా రుణమాఫీ కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తాం అని అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది, ముందు అధికారుల దృష్టికి తన దృష్టికి సమస్యను తీసుకురండి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని పేర్కొన్నారు మంత్రి పొన్నం.

Read more RELATED
Recommended to you

Latest news