ఎంపీ అభ్యర్థి నామినేషన్ పై మంత్రి పొన్నం కామెంట్స్

-

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉండడంతోనే ఆయన నామినేషన్ వేసినట్లు తెలిపారు. దీనిపై సీఈసీ అధికారికంగా ప్రకటన చేస్తుందన్నారు. బీజేపీలో సఖ్యత లేదని.. తామంతా ఐక్యంగా ఉన్నామని అన్నారు.

కాగా, కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ నామినేషన్ వేశారు. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఆయన నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. మంత్రి పొన్నంతో సహా పలువురు జిల్లా నేతలు ఆయనతో వెళ్లి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు కరీంనగర్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి రేవంత్తో భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version