నో కరోనా నో కరోనా.. కొత్త స్లోగన్ మొదలెట్టిన కేంద్ర మంత్రి

-

కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే, గతంలో ఇచ్చిన “గో కరోనా, గో” స్లోగన్ సంచలనంగా మారిందన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన నో కరోనా నో కరోనా అనే కొత్త నినాదంతో వెలుగులోకి వచ్చారు. ఇది కరోనా వైరస్ యొక్క కొత్త స్ట్రైన్ కోసం అని ఆయన చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ “నేను” గో కరోనా గో “నినాదాన్ని ఇచ్చాను అందుకే వైరస్ ఇప్పుడు తగ్గు ముఖం పట్టింది.

అయితే ఇది చివరికి నా దగ్గరికి కూడా వచ్చింది, నన్ను ఆసుపత్రి పాలు చేసింది. కరోనా వైరస్ నన్ను చేరుకోదని నేను అనుకున్నాను కాని అది ఎక్కడైనా చేరగలదని అథవాలే చెప్పారు. కొత్త కరోనా వైరస్ జాతి కోసం, నేను” నో కరోనా, నో కరోనా ” అని స్లోగన్ ఇచ్చానని అన్నారు. ఎందుకంటే పాత కరోనా వైరస్ లేదా కొత్త వైరస్ అయినా మన వాళ్ళకి సోకడం నాకు ఇష్టం లేదు అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version