మంత్రి సీతక్క పీఏ.. సస్పెండైనా మళ్లీ విధుల్లోకి ఇసుక మాఫియా డాన్

-

మంత్రి సీతక్క దగ్గర పనిచేస్తూ ఇసుక దందాలో చక్రం తిప్పిన పీఏ సుజిత్ రెడ్డి ఇటీవల సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుజిత్ రెడ్డి మళ్లీ విధుల్లో చేరినట్లు సమాచారం.సీఎం రేవంత్ రెడ్డి కుడి భుజంలా మారిన సుజిత్.. ఇటీవల భద్రాచలంలో పట్టుబడిన 16 ఇసుక లారీల వ్యవహారంలో ఆయన హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పుడు మళ్లీ బయటకొచ్చి రేవంత్ రెడ్డితో సుజిత్ రెడ్డి కలిసి తిరుగుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి సైతం సుజిత్‌ని పేరు పెట్టి పిలిచేంత ఇద్దరి మధ్య దగ్గర బంధం బలపడినట్లు తెలిసింది. సోమవారం మూడుజిల్లాలో సీఎం పర్యటలో సుజిత్ రెడ్డి ఒక్కసారిగా దర్శనం ఇచ్చాడు. దీంతో పైకి మాత్రమే సస్పెండ్‌లు.. లోపల మాత్రం అనుబంధాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news