ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ టార్గెట్ : మంత్రి తలసాని

-

ప్రజలు నమ్మి ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ టార్గెట్ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాషాయపార్టీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.  మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా ఇవాళ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అధికార దాహంతోనే బీజేపీ నేతలు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని మంత్రి తలసాని దుయ్యబట్టారు. దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు యత్నించారని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని చెప్పారు.

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఆశ చూపారని, ఇన్ని కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. బీజేపీ తీరు దొంగే.. దొంగాదొంగా అన్నట్లుగా ఉందని అన్నారు. చేసిందంతా చేసిన బీజేపీ అని.. ఇప్పుడు నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version