సారా వ్యాపారం చేసుకునే మిథున్ రెడ్డి నన్ను ఓడిస్తారట ! : పవన్ కళ్యాణ్

-

బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరపున చంద్రబాబుతో కలిసి రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని రాజంపేట ఓటర్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్న రాజ్యాధికారాన్ని మార్చాలని అన్నారు. యువతకు తలుచుకుంటే ఆ పని ఈజీ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారని అన్నారు.

సారా వ్యాపారం చేసుకునే మిథున్ రెడ్డి తనను ఓడిస్తారట అని సెటైర్స్ వేశాడు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిని ఎదుర్కొనే బలం యువతకు లేదా అని ఆయన ప్రశ్నించారు. అన్నమయ్య డ్యామ్‌లో ఇసుక తోడేయడం వల్ల 39 మంది మృతి చెందారని ,డ్యాములు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పట్టించుకోరని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మద్యం వ్యాపారాలు చేసుకుంటూ సంపదంతా వారి కుటుంబాల పేరుపై దాచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version