మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

-

ఇటీవల మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా నేడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏడాదిలోపు ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడంలేదని మండిపడ్డారు ఆనం.

కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. అధికారులను అడిగితే త్వరలో పూర్తి చేస్తామని చెబుతున్నారని.. అవి పూర్తి అయ్యే లోపు తమ పదవి కాలం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చుని పని చేయాలో అర్థం కావడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version