సింగరేణి సంస్థపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక కామెంట్స్ చేసాడు. సింగరేణిలో ప్రైవేటు వ్యవస్థలతో బొగ్గు ఉత్పత్తి యత్నాలను విరమించుకోవాలి. సింగరేణి సంస్థ బొగ్గు బావుల మీద శ్రద్ధ చూపకుండా ప్రైవేట్ వ్యాపారల పై అధిక శ్రద్ధ చూపుతుంది. సింగరేణిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువ అయ్యాయి. సంస్థలో అవినీతి తరా స్థాయికి చేరుకుంటున్నది, రాజకీయ జోక్యం బాగా పెరిగింది. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలి. సింగరేణి కి ప్రభుత్వం బకాయి పడ్డ వేల కోట్లు చెల్లించాలి.
సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉద్యమం చేస్తాం. సింగరేణిలో కీలక డైరెక్టర్ పోస్టులు ఖాళీ, సిఎండి పై స్పష్టత లేదు, యాజమాన్యం లో గందరగోళం ఉంది. సింగరేణి ఉత్పత్తి పై ప్రభావం, ఎన్నికల కోడ్ లకు సంస్థ కార్యకలాపాల కు సంబంధం ఏంటి, కోడ్ పేరుతో కార్మికుల సమస్యల పరిష్కారం పై నిర్లక్ష్యం తగదు. కొత్తగూడెం, ఇల్లందు కొత్త గనుల్లో బొగ్గు సైతం ప్రైవేటుకు అప్ప చెప్పే చర్యలు చట్ట విరుద్ధం. BRS ప్రభుత్వంలో ప్రైవేటీకరణకు ఎక్కువ మొగ్గు చూపింది.. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బొగ్గు తీసే పనులును సింగరేణి సంస్థ చేపట్టేలా చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు.