బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేసినట్లు సమాచారం.హన్మకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద 20 ఏళ్లుగా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న చిరు వ్యాపారిపై నాయిని రాజేందర్ అనుచరుడు రమేష్ దాడికి పాల్పడ్డారు.
ఆ చోటు ఖాళీ చేయాలనీ, తన మనిషి షాప్ పెట్టుకుంటాడని దాడిచేసినట్లు సమాచారం.అడ్డు వచ్చిన చిరు వ్యాపారి భార్యను మహిళ అని కూడా చూడకుండా మేము ఎమ్మెల్యే మనుషులం, ఎమ్మెల్యే పీఏ కిరణ్కు మొత్తం తెలుసు అంటూ రమేష్ బూతులు తిట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, ఎమ్మెల్యే అనుచరులు ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.
రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం
హన్మకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద, 20 ఏళ్లుగా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న చిరు వ్యాపారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి… pic.twitter.com/xEk06iETIg
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2025