సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

-

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. జోకర్ కేటీఆర్, బట్టేబాజ్ సీఎం కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో అభివృద్ధి విషయంలో ఎంఐఎం పార్టీ డబుల్ గేమ్ ఆడుతుందని మండిపడ్డారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్స్ కూడా అసెంబ్లీలో మెట్రో కావాలని అడిగి.. సీఎం ఛాంబర్ కు వెళ్లి ఓల్డ్ సిటీకి మెట్రో వద్దంటారని విమర్శించారు.

ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణ కోసం నిరసన తెలియజేస్తే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందితే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావనతోనే ఎంఐఎం డెవలప్మెంట్ కానివ్వడం లేదని ఆరోపించారు. ఓల్డ్ సిటీ లో ముస్లింల అభివృద్ధి కోసం నిజంగా పోరాటం చేసేది బిజెపి పార్టీ ఒకటే అన్నారు. ఓల్డ్ సిటీ అభివృద్ధి కావాలంటే బిజెపికి మద్దతు ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version