కొత్త పార్లమెంట్ లో స్పీకర్ ఓం బిర్లాతో ప్రధాని మోదీ…

-

ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ బాగా పాతది కావడంతో… కేంద్రం కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ నిర్మాణ ప్రాజెక్టు ను టాటా ప్రాజెక్ట్స్ వారు చేస్తున్నారు. ఇక నూతన పార్లమెంట్ నిర్మాణం పనులు పూర్తి కావస్తుండడంతో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పనులను చూడడానికి వెళ్లారు. స్వయంగా గంట సేపు అక్కడే ఉండి నిర్మాణాన్ని, అక్కడి పనిచేస్తున్న కార్మికులను అడిగి విషయాలను తెలుసుకున్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీతో పాటుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు.

కాగా మోదీ తన దృష్టిని అంతా రానున్న ఎన్నికల్లో మళ్ళీ బీజేపీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి అన్న విషయం పైనే తన దృష్టిని కేంద్రీకరించాడు. అయితే దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమేనా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version