ఆల్ పార్టీ మీటింగ్ లో మోడీ కీలక వ్యాఖ్యలు

-

మరోసారి చర్చలకు సిధ్ధం అంటూ ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో సారి వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల అభ్యంతరాలపై చర్చలకు కేంద్రం సిద్ధం అంటూ ఆయన పేర్కొన్నారు. నేటి అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నోట మరోసారి చర్చల ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వం రైతులతో మాట్లాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, చట్టాలను నిలిపి వేస్తామని కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఇప్పటికీ ఉంది” అని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.

modi

ఇక దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు, రిటైర్డ్ అధికారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్తతల విషయం మీద వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో గాయాల పాలైన పోలీసులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులతో పాటు రిటైర్డ్ అధికారులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version