నా జీవితంలో ఎప్పుడూ ఇంత బాధ అనుభవించలేదు : మోదీ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలోని ఐక్యతా ప్రతిమ వద్ద మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుజరాత్‌లో మోర్బీ తీగల వంతెన కూలిన దుర్ఘటనను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంతటి బాధను అనుభవించ లేదని అన్నారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే తన హృదయం తల్లడిల్లిందన్నారు.

“ప్రస్తుతం నేను ఏక్తానగర్‌లో ఉన్నా… నా మనసు మాత్రం మోర్బీ బాధితుల వద్దే ఉంది. నా జీవితంలో ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువ. ఒక వైపు బాధతో కూడిన హృదయం ఉంది. మరోవైపు కర్తవ్యం నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది. ఆ కర్తవ్య బోధను అనుసరించి నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది.” అని ప్రధాని నరేంద్ర మోదీ భరోసానిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version