దక్షిణాదిన బీజేపీ ప్రభావం పై మోడీ కీలక వ్యాఖ్యలు

-

దక్షిణాదిన బీజేపీ ప్రభావం లేదనేవారికి తాజా ఎన్నికలు షాక్‌ ఇచ్చాయన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ, కర్ణాటకలో సత్తా చాటామని చెప్పారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు.

ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూసిందని, కరోనా సమయంలో ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామని అన్నారు.బిహార్‌లో అద్భుత విజయం అందించారని.. పనిచేస్తూ ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారన్నారు ప్రధాని మోడీ. విజయోత్సవ సభలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పలువురు బీజేపీ అగ్రనేతలు, పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version