నేడు ప్రధాని మోడీ బహిరంగ సభ..హాజరుకానున్న 10 లక్షల మంది !

-

ఇవాళ బీజేపీ కార్యవర్గ చివరి సమావేశం హైదరాబాద్‌ లో జరుగనుంది. ఈ నేపథ్యంలోనే.. పరేడ్‌ గ్రౌండ్స్‌ లో ప్రధాని మోడీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక ఈ సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని సమాచారం అందుతోంది. అయితే.. ప్రధాని మోడీ బహిరంగ సమావేశంపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్… కీలక ప్రకటన చేశారు.

ప్రధాని బస సందర్భంగా రాజ్ భవన్ లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామని.. హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్ భవన్ మార్గాల్లో 4 వేల మంది పోలీసులు పహారాలో ఉంటారన్నారు. జడ్, జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న నాయకులు వస్తోన్న నేపథ్యంలో భారీ భద్రత అని… ప్రధాని మోదీ సహా..‌‌కేంద్రమంత్రులు సభకు హాజరవుతారన్నారు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్. పరేడ్ గ్రౌండ్స్ లో లక్షమంది వరకు కూర్చునే అవకాశం ఉంటోంది.. సభకు ప్రధాని మోదీ సహా.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉందన్నారు.

కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ స్థలాలు కేటాయించారని.. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించామని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా ఉంటుందని.. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్త్ లో ఉంటారన్నారు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version